ముంబై, జూన్ 7 : ఇండియా అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ.. తన బాల్య స్నేహితురాలు శ్లోకాను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. జూన్ 30న వీరి నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఆహ్వాన వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ తో కలసి నీతా అంబానీ ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక గుడికి వెళ్లారు. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలను నిర్వహించి, ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన తొలి ఆహ్వానపత్రికను ఆలయంలో సమర్పించారు. ఈ ఏడాది మార్చి 24న శ్లోకాకు అకాష్ తన ప్రేమను వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు వీరి వివాహానికి అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు కలసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు కూడా వచ్చారు. ఆకాశ్, శ్లోకాలు కలిసి చదువుకున్నారు. డిసెంబర్ లో వీరి వివాహం జరగవచ్చని తెలుస్తోంది.