ముంబై, జూన్ 6 : ముంబై రెస్టారెంట్ లో ఓ వ్యక్తి జేబులోని మొబైల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు విషయం ఏంటంటే.. ముంబైలోని భాందప్ ప్రాంతంలో ఓ వ్యక్తి రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తుండగా ఆ వ్యక్తి చొక్కా జేబులో ఉన్న ఫోన్ పేలడంతో తన సీట్లో నుంచి వెంటనే లేచి ఫోన్ తీసి విసిరి పడేశారు. ఈ ఘటనతో అక్కడున్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీసారు. అంతేకాదు ఆ ఫోన్ పేలిన రెస్టారెంట్ లో మొత్తం పొగ వ్యాపించింది. ఈ సంఘటనతో సదరు వ్యక్తి గాయపడగా ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో బంధించబడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఆ ఫోన్ ఏ కంపెనీదో మాత్రం వివరాలు తెలియరాలేదు.