మూడు ముళ్లు వేసే ఒక్క క్షణం ముందు..

SMTV Desk 2018-06-06 12:34:33  bride jump, bride jump in chennai, tamilanadu, ranjeetham

చెన్నై, జూన్‌ 6 : మరికాసేపటిలో వరుడు చేత మూడు ముళ్లు కట్టించుకోవాల్సిన వధువు హఠాత్తుగా ముహర్త సమయానికి అదృశ్యమై పోయింది. దీంతో ఎంచేయాలో పాలుపోక పెళ్లికొడుకు అదే ముహూర్తానికి బంధువులమ్మాయి మెళ్లో తాళి కట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగింది. బన్రుట్టి గ్రామస్థుడు, పూలవ్యాపారి అళగేశన్‌కు సోమకోట గ్రామానికి చెందిన రంజితం(24)తో జూన్‌ 4న వివాహం జరిపించుటకు ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించుకున్నారు. పెళ్లి కోసం సంబందిత పనులన్నీ చక్కబెట్టారు. తీరా పెళ్లిరోజు వచ్చేసరికి ముహూర్త సమయానికి రంజితం కనపడకుండా పోయింది. దీంతో అందరూ ఆమె కోసం గాలించారు. ఎంత వెతికిన ఫలితం లేకపోవడంతో, అళగేశన్‌కు అప్పటికప్పుడు చుట్టాలమ్మాయితో వివాహం జరిపించారు. కాగా.. రంజితం కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె పెళ్లి ఇష్టంలేక వెళ్లిపోయిందా, లేక ఎవరినైనా ప్రేమించి పారిపోయిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.