లక్నో, జూన్ 3 : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నాలుగు గోడల మధ్య ఉన్న శనివారం ప్రజలు సమక్షంలో సంతోషంగా గడిపారు. శనివారం రాత్రి వీవీఐపీ గెస్ట్ హౌజ్లో గడిపిన అఖిలేష్.. ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ గోమ్టి నది తీరానికి వెళ్లి అక్కడ మార్నింగ్ వాక్కు వచ్చిన వారితో మాట్లాడారు. వాళ్లతో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అక్కడే కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండటంతో వాళ్ల దగ్గరికి వెళ్లి తానూ కాసేపు బ్యాట్ పట్టుకున్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తన అధికారిక బంగ్లా ఖాళీ చేసిన విషయం తెలిసిందే. గోమ్టి రివర్ ఫ్రంట్ను సమాజ్వాదీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. తమ ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటిపై తాను ఓ కన్నేసి ఉంచుతానని ఈ సందర్భంగా అఖిలేష్ అన్నారు. శనివారం సాయంత్రం కూడా జనేశ్వర్ మిశ్రా పార్క్కు వెళ్లి కాసేపు గడిపారు. యూపీ మాజీ సీఎంలందరూ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలని గత నెల 7వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.