ముంబై, జూన్ 2 : అఫ్గానిస్తాన్తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా బదులు మరో కీపర్ దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన సాహాకు.. టోర్నీలో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన ఫైనల్ కు కూడా దూరమయ్యాడు. దీంతో అఫ్గాన్తో జరిగే టెస్టుకు తాను సిద్దంగా లేనట్లు సాహా ఇటీవల వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ట్వీట్ చేసింది. "అఫ్గాన్తో జరిగే ఏకైక టెస్ట్కు వృద్దిమాన్ సాహా దూరమయ్యాడు. అతని స్థానంలో సెలక్టర్లు దినేశ్ కార్తీక్ను ఎంపిక చేశారు"అని ట్వీట్లో పేర్కొంది. బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టెస్టుల్లో అఫ్గాన్కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు సారథి విరాట్ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కోహ్లి గైర్హాజరితో భారత జట్టుకు అజింక్యా రహానే నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.
UPDATE: Wriddhiman Saha ruled out of the @paytm Afghanistan Test.
— BCCI (@BCCI) June 2, 2018
The All-India Senior Selection Committee has named @DineshKarthik as the replacement. #INDvAFG #TeamIndia
Details - https://t.co/drNqHvsFu0 pic.twitter.com/hqquMTpqDP