న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఢిల్లీ నగరంలో కూడా ఈ రోజు స్కూల్ వ్యాను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థిని మరణించగా, 17 మంది గాయపడ్డారు. సమాచారం తెల్సుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, విద్యార్థులు కేశవపురం కేంద్రీయ విద్యాలయ, స్కూల్ నెంబర్ 1కు చెందిన వారిగా గుర్తించారు. కన్హియా నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో విద్యార్థులు ఉదయం మారుతి ఓమ్ని వ్యానులో పాఠశాలకు వెళ్తుండగా ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.