కోమటి రెడ్డి, సంపత్‌లకు హైకోర్ట్ లో ఊరట

SMTV Desk 2018-04-18 11:17:47  mla komati reddy, sampath, high court, assembly.

కోమటి రెడ్డి, సంపత్‌లకు హైకోర్ట్ లో ఊరట హైదరాబాద్, ఏప్రిల్ 18 : కాంగ్రెస్ సభ్యులు ఎమ్మెల్యే కోమటి రెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్ట్ లో ఊరట కలిగింది. శాసనసభ నుంచి వారిరువురిని బహిష్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తెలంగాణ బడ్జెట్ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి, సంపత్‌కుమార్‌లు శాసన సభలో గందరగోళం నిర్వహించారు. గవర్నర్ పైకి స్పీకర్ ఫోన్స్ విసిరిన ఘటనకు కోమటిరెడ్డి, సంపత్ లను సభ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, అలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు జారీచేసిన ప్రకటనలను రద్దుచేసింది. ఆయా నియోజకవర్గాలలో వారి సభ్యత్వం పునరుద్ధరణ అవుతుందని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా వారి మిగిలిన పదవీకాలం కూడా యథావిధిగా అన్ని అంశాల్లో కొనసాగుతుందన్నారు. న్యాయసుత్రాలకు విరుద్దంగా ఈ పిటిషనర్లపై బహిష్కరణ వేటు వేశారని తేల్చిచెప్పింది. అలాంటి ఉత్తర్వులకు విలువ ఉండదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఈ మేరకు ఎమ్మెల్యేల బహిష్కరణ ఉత్తర్వులను రద్దుచేస్తూ 172 పేజీల తీర్పును వెలువరించారు.