హైదరాబాద్, మార్చి 27 : అక్కినేని వారసుడు అఖిల్.. తన సినిమాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతనికి మాత్రం సరైన హిట్ ను అందించలేకపోతున్నాయి. "అఖిల్", "హలో" సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాని ఆ సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల్పై ముహూర్తపు సన్నివేశానికి నాగార్జున క్లాప్ కొట్టగా.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అఖిల్కు జోడీగా ఎవరు నటిస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా అయినా అఖిల్ కు మంచి హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.