హైదరాబాద్, మార్చి 24 : తెరపై మరణించే పాత్రలో తానూ నటించను అంటోంది హీరోయిన్ నిత్యామీనన్. స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ.. తొలి సినిమాలో పాట పాడడమే కాకుండా తనకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. వైవిధ్యమైన నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నిత్యా.. తన వద్దకు వచ్చే కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. తెర మీద తన పాత్రను చంపడం ఇష్టం లేదని.. అలాంటి కథతో దర్శకనిర్మాతలు తన వద్దకు రావొద్దని కోరుకుంటోంది. చనిపోయే పాత్రలో నటించాలంటే ఇబ్బందికరంగా ఉంటున్నాయట! అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. కాగా నటి అన్నాక ఎలాంటి పాత్ర ఇచ్చిన చేయాలి కాని తనకు నచ్చిన పాత్రలే చేస్తా అనడం సరికాదని సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుతోంది.