హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. * డిప్యుటీ సీఎం - చిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టడం అభినందనీయం. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం కమిషన్పై ఉంది. * హోంమంత్రి నాయిని - ఉద్యమంలో పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్కు మాత్రం నిజమైన సేవ చేసే అవకాశం వచ్చింది. * మంత్రి హరీష్రావు - ఉద్యమ సమయంలో శ్రీనివాస్ పోరాటం మరువలేనిది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీలకు అందేలా కమిషన్ సభ్యులు కృషి చేయాలి. బంగారు తెలంగాణ కోసం ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలి. * ఎర్రోళ్ల శ్రీనివాస్ - ఈ పదవి నాకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తాను.