హైదరాబాద్, ఫిబ్రవరి 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ లో ఓ వైర్ లెస్ సెట్ బ్యాటరీ నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమంగా ఉన్నారని ఆల్ ఈజ్ వెల్ అని కేసీఆర్ తన ఆదిలాబాద్ జిల్లా పర్యటనను కొనసాగిస్తారని ట్వీట్ చేశారు. పెద్దపల్లి పర్యటనకు బయలుదేరేందుకు కేసీఆర్ హెలికాఫ్టర్ ఎక్కిన అనంతరం ఓ బ్యాగ్లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావడ౦తో అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగ్ను వంద మీటర్ల దూరం తీసుకొచ్చి పడేశారు.