హైదరాబాద్, ఫిబ్రవరి 23 : నగరంలోని జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ గోడౌన్లో సంభవించిన మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతూ పక్కన ఉన్న పలు కంపెనీలను సైతం చుట్టుముట్టాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ గోడౌన్ లో దాదాపు 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందులో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.