హైదరాబాద్, ఫిబ్రవరి 16 : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ నగరంలో పర్యటిస్తున్న సందర్భంగా మధ్యాహ్నం మక్కా మసీదులో జరిగే ప్రార్థనల్లో ఆయన పాల్గొననున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అడిషనల్ సీపీ శివప్రసాద్, సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.