హైదరాబాద్, ఫిబ్రవరి 10 : నగరంలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్ నారాయణగూడలోని రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు చామంతి(18), దివ్య(20) లు అదృశ్యమయ్యారు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరూ అదే కాలేజీకి సంబంధించిన రెడ్డి హాస్టల్లోనే ఉంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.