హైదరాబాద్, జనవరి 24 : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. తమ జాతికి జరుగుతున్న అన్యాయంపై త్వరలోనే గవర్నర్ను కలుస్తానని తెలిపారు. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఎన్నో కేసులు నమోదైనా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదని వాపోయారు. తనపై నమోదైన కేసు నిమిత్తం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. "తెలంగాణలో దళితులకు ఒక న్యాయం, ఉన్నత వర్గాలకు ఒక న్యాయమా.? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రజాయత్రకు బందోబస్తు కల్పించిన కేసీఆర్.. తమను అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుందని ఆరోపించారు.