హైదరాబాద్, జనవరి 24 : మల్టీ స్టారర్.. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్ హీరోలు కథ నచ్చితే ఇతర హీరోలతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. రామ్చరణ్ - ఎన్టీఆర్, నాగార్జున - నాని, వెంకటేష్ - వరుణ్తేజ్... ఇలా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్న మల్టీ స్టారర్ కోసం తెలుగు పరిశ్రమలో జోరు చర్చ సాగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి విక్టరీ వెంకటేష్- నారా రోహిత్ చేరారు. తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇద్దరు కథానాయకులతో కూడిన ఈచిత్రంలో రెండో పాత్ర కోసం నారా రోహిత్ని ఎంపిక చేశారు.