మందకృష్ణ కు బెయిల్ మంజూరు..

SMTV Desk 2018-01-23 16:01:20  mrps president, manda krishna madhiga, bail sanction.

హైదరాబాద్, జనవరి 23 : ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. అనుమతి లేకుండా ఉపవాస దీక్ష చేసినందుకు ఈ నెల 2 వ తేదీ నుండి చంచల్‌గూడ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.