హైదరాబాద్, జనవరి 21: ఈ మధ్య కాలంలో చిన్న నుండి పెద్ద వరకు అందరికీ కళ్ళద్దాలు ఉంటున్నాయి. రోజంతా ఆ కళ్ళద్దాలు పెట్టుకొని ఉండడం వల్ల ముక్కుకి ఇరువైపులా మచ్చలు పడుతుంటాయి. ఆ చిన్న మచ్చలు కాస్తా పెద్దగా అయితే ముఖం చూడ్డానికి అంద హీనంగా కనిపిస్తుంది. ఈ మచ్చలు పోవాలంటే ఇలా చేసి చూడండి. ముఖ చర్మం మీద చోటుచేసుకునే మచ్చలను తొలగించాలంటే ముందుగా మనం ఉపయోగించే ఔషదం కలబంద. ప్రతి రోజు రాత్రిపూట కలబంద గుజ్జును ముక్కుకు రాసి మర్దన చేసి పడుకోవాలి. మర్నాడు గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఆ మచ్చలు పోయి ముఖం చాలా సౌందర్యంగా తయారవుతుంది .