థియేటర్లను దగ్ధం చేస్తామంటూ రాజ్‌పుత్‌ల ఆందోళన..

SMTV Desk 2018-01-18 15:26:46  padmavath movie, chittor ghad, protest, suprim court.

రాయ్‌పూర్, జనవరి 18 : ఎన్నో వివాదాలను ఎదుర్కొని విడుదలకు సిద్దంగా ఉన్న "పద్మావత్‌" చిత్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్‌పుత్‌ వంశస్తులు సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. రాణి పద్మావతిని ఎవరూ తక్కువ చేసి చూపించరాదని, ఒకవేళ అలా కాదని సినిమాను థియేటర్ లో ఎక్కడ ప్రదర్శించినా.. ఆ థియేటర్లను దగ్ధం చేస్తామని చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌పుత్ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా పద్మావత్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌పుత్ వర్గీయులు పలువురు హోంమంత్రికి ఓ లేఖ సమర్పించారు. ఈ వివాదాల నడుమ దేశవ్యాప్తంగా "పద్మావత్" చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధ౦గా ఉంది.