నేటి నుంచి తెలంగాణలో సమగ్ర నేరస్తుల సర్వే :డీజీపీ

SMTV Desk 2018-01-18 14:39:21   A comprehensive crime survey in Telangana DGP Mahendhar reddy

హైదరాబాద్, జనవరి 18 : తెలంగాణ రాష్ట్రంలోని నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేడు నేరస్తుల కుటుంబాలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేరస్తుల్లో మార్పు తీసుకురావడం కోసం నేటి నుంచి సమగ్ర నేరస్తుల సర్వే చేపట్టి, నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ వ్యవస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పదేళ్లుగా నేరం చేస్తున్న వారి కుటుంబ పరిస్థితులు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా వారు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేసి నిఘా పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా హాజరయ్యారు.