ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో తెరాస విజయం

SMTV Desk 2018-01-13 12:47:33  MPTC By-election Win TRS

హైదరాబాద్‌, జనవరి 13 : ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. మొత్తం 16 స్థానాల్లో తొమ్మిదింటిని తెరాస సొంతం చేసుకుంది. ఏకగ్రీవమైన మూడు స్థానాల్లో రెండు సీట్లు తెరాస గెలుచుకుంది. మరో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌, భాజపా చెరో రెండు చోట్ల విజయాన్ని పొందాయి. నల్గొండ జిల్లా కిష్టాపురం, ఖమ్మం జిల్లా జక్కేపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటల, వనపర్తి జిల్లా గోపాల్‌ దిన్నె, కూసుమంచి, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ, భద్రాచలం ఎంపీటీసీ ఏడోస్థానికి జరిగిన ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, ఆచంపల్లిలో తెరాస ఓటమి చవిచూసింది.