హైదరాబాద్, జనవరి 13 : సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో ఎక్కడ చూసిన జన సంద్రం కనిపిస్తోంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. పట్టణాల నుండి పల్లె బాట పట్టిన వారితో నగరమంతా కిక్కిరిసి పోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకరినొకరు తోసుకుంటూ రైలు ఎక్కే పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. అలాగే రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. రద్దీ ఏర్పడకుండా ప్రయత్నించినా.. ప్రయాణికులకు నిరీక్షణ మాత్రం తప్పడం లేదు.