శంషాబాద్, జనవరి 13 : గణతంత్ర దినోత్సవ వేడుకలు రానుండడంతో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో ఈ నెల 31 వరకు సందర్శకుల పాసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తున్నారు. సీఐసీఎఫ్, సైబరాబాద్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ మేరకు బందోబస్తులో నిమగ్నమయ్యారు.