హైదరాబాద్, జనవరి 12: తెలంగాణా ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఈ పండుగ వారి జీవితాల్లో వెలుగును నింపాలని కోరారు. రాష్ట్రంలో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగాలని భగవతుణ్ణి ప్రార్ధించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరేందుకు అధికారులు చిత్తశుద్ధిగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.