హైదరాబాద్, జనవరి 12 : సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘గునుంగ్ అగుంగ్’ అగ్నిపర్వతాన్ని హైదరాబాద్కు చెందిన పెద్దినేని సాయితేజ అనే యువకుడు అధిరోహించాడు. ఈ నెల 10న విషయాన్ని సాయితేజ తండ్రి నాగేశ్వర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సహాయకులు, శిక్షకుల సహకారం లేకుండానే 2 రోజులలోపే ఈ పర్వతాన్ని అధిరోహించినట్లు ఆయన చెప్పారు. కాగా, గతేడాది మేలో ఇండోనేషియాలోని దుకోణో అగ్నిపర్వతాన్ని సాయితేజ అధిరోహించి, తొలిసారి ఆ పర్వతాన్ని అధిరోహించిన భారతీయుడిగా నిలిచినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆ యువకుడు చేసిన సాహసానికి ప్రభుత్వం సాయం చేకూరాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.