హైదరాబాద్, జనవరి 11 : నేటి నుంచి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 21వ తేదీవరకు ఈ సంక్రాంతి సందడి నెలకొననుంది. ఈ పండుగ సంబరాల్లో ముగ్గుల పోటీలు, హరిదాసుల సంకీర్తనలు, పతంగుల పోటీలతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ, దక్షిణ భారతదేశంలోని చేనేత హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఏర్పాటుచేయనున్నారు. ప్రతిరోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ అధికారి కిషన్రావు వెల్లడించారు.