హైదరాబాద్, జనవరి 9 : రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటినుండే సన్నద్దమవుతోంది. ఇందుకోసం ప్రజలలోకి వెళ్ళే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున నలభై రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం సహా ప్రజా సమస్యలపై చైతన్య కార్యక్రమాల కోసం కార్యాచారణ రూపొందిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మ గౌరవ సభ పేరుతో ఫిబ్రవరి రెండవ వారంలో వరంగల్ కేంద్రంగా భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఆయన వచ్చే సమయానికి తెలంగాణలో మేడారం జాతర హవా కొనసాగనుండగా ఆ జాతరకు కూడా ఆయన హాజరు కానున్నట్లు సమాచారం. 2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి పంపేలా ప్రత్యేక కార్యాచారణ రూపొందిస్తున్నారు.