హైదరాబాద్, జనవరి 9 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 132 ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 32% అధికంగా రైళ్లను నడిపిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే, ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచుతామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశానికి వెళ్లే యాత్రికులు, శబరిమలై వెళ్లే యంత్రికుల సౌకర్యార్థంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు. రైలు ప్రయాణికులకు భద్రత సమస్యలు ఏర్పడితే 182కు ఇతర సమస్యలు, సందేహాలకు 139 నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.