హైదరాబాద్, జనవరి 8 : నగరంలో అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురు యువతులు పట్టుబడ్డరని ట్రాఫిక్ సీఐ బాలవంతయ్య తెలిపారు. జూబ్లిహిల్స్ లో నిర్వహించిన ఈ తనిఖిల్లో పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికారు. అందులో ఇద్దరు యువతులు శ్వాస విశ్లేషణ పరీక్షలకు సహకరించకుండా హాల్ చల్ చేశారు. కొందరు తమ వాహనాలను అప్పగించేందుకు నిరాకరిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు వాహన దారులు తప్పించుకొనేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు మొత్తం 14 కేసులు నమోదు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీరందరు కూడా నేడు తల్లిదండ్రులను తీసుకుని కౌన్సెలింగ్కు రావాల్సిందిగా సీఐ వెల్లడించారు.