నగరంలోని మూడు స్కూల్‌ బస్సులు దగ్ధం

SMTV Desk 2018-01-07 15:48:44  Three school buses are burned, Janapriya Olympiad School hyderabad

హైదరాబాద్, జనవరి 7 : ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి స్కూల్ బస్సులో వేయడంతో మంటలు వ్యాపించి మూడు బస్సులు దగ్ధమయ్యాన ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ చోటుచేసుకుంది. నగర శివారు మియాపూర్ జనప్రియ ఒలింపియాడ్ స్కూల్ బస్సు పార్కింగ్ లో ఉన్న సమయాన అపరిచితులు ఎవరో సిగరెట్ తాగి బస్సులో పడేయడంతో మంటలు సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే, పక్కనే ఉన్న మిగితా రెండు బస్సుల వాటిలో కూడా మంటలు వ్యాపించడం జరిగింది. కాగా, గతంలోనూ ఇదే పాఠశాలకు చెందిన బస్సులు కాలిపోయాయి. ప్రస్తుతం కూడా మళ్లీ ఇలాంటి సంఘటన ఎదురుకావడం పలు అనుమానాలు వెల్లడవుతున్నట్లు సమాచారం.