హైదరాబాద్, జనవరి 7: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మైకంలో ఉన్నవ్యక్తి అతివేగంతో వచ్చి ఒకరి ప్రాణాలను తీశాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఆదివారం తెల్లవారుజామున పంజాగుట్టకు చెందిన విష్ణువర్థన్ మద్యం సేవించి అతివేగంతో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న మహిళ అక్కడిక్కడే మరణించింది. స్కూటీ వెనుక కూర్చున్న మరో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగి ఉన్న విష్ణువర్థన్ ను పోలీసులు అరెస్టు చేశారు.