హైదరాబాద్, జనవరి 4 : సంక్రాంతి పండగకు కోడి పందేల జోరు తగ్గను౦ది. ఈ మేరకు హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎలాంటి కోడిపందేలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు డీజీపీలను ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి పక్కకు తప్పుకోవడం కాదు.. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పాలని వెల్లడించింది. గతేడాది తహశీల్దార్లు, పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం నివేదికలు చూపించింది. అదే తరహాలో కాకుండా ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసు అధికారులు జనరల్ హైకోర్టుకు తెలిపారు.