హైదరాబాద్, జనవరి 4 : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ఇప్పటికే రూ.2వేలు, రూ.500, రూ.200, రూ.50ల కొత్తనోట్లు జాబితాలోకి చేరాయి. అయితే, ఈ జాబితాలో ప్రస్తుతం కొత్తగా రూ.10 నోటు చేరనుంది. రానున్న రోజుల్లో చాకొలెట్ రంగుతో కూడిన కొత్త రూ.10 నోట్లను ప్రవేశపెట్టనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్ సూర్య దేవాలయం గుర్తును కూడా ముద్రించనున్నారు. ఈ మేరకు నిర్ణయం గతవారమే నిర్ణయించడం జరిగింది. రూ. 10 నోట్లను 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 632,000 నోట్లు ముద్రించింది. కాగా, గత ఏడాది డిసెంబర్ 8 నాటికి ఆర్బీఐ 16.96 బిలియన్ల రూ.500 నోట్లు, 3.6 బిలియన్ల రూ.2000 నోట్లు ముద్రించారు.