హైదరాబాద్, జనవరి 2 : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మందకృష్ణ మాదిగ ఇందిరాపార్కు, బాపూఘాట్ వద్ద చేపట్టే ఉపవాస దీక్షకు అనుమతి కోరితే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఇవ్వలేదని వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో భాగంగా చేసే ఉద్యమాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” సమస్యల పరిష్కారం కోసం ఉపవాస దీక్షకు అనుమతి కోరం తప్ప. హింసను సృష్టించడానికి కాదు. ఎవరు అడ్డుకున్నా మా దీక్ష ఆగదు. అలాగైతే మిలియన్ మార్చ్లో అంత విధ్వంసం చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు , కోదండరామ్లను ఎందుకు అరెస్టు చేయలేదు. హైదరాబాద్ ప్రజలు సమస్యల మీద హైదరాబాద్లో కాకుండా కరీంనగర్లో ధర్నా చేయాలా..? మేము దళితులం కాబట్టే మా పై కేసులు పెడుతున్నారు. ఉద్యమంలో కేసీఆర్, కేసీఆర్, హరీష్రావులపై పెట్టిన 307 కేసులు సంగతి ఏంటి...?” అని వ్యాఖ్యానించారు.