హైదరాబాద్, జనవరి 2 : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలలో ‘బయోపిక్’ ల ట్రెండ్ నడుస్తుంది. తాజాగా జననేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. ఇందులో రాజశేఖర్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే టాలీవుడ్లో అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, మరోపక్క బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ పై ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా ‘మహానటి’ సినిమా సిద్ధమవుతోంది. అంతే కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ ఉయ్యాలవాడ పాత్రలో నటిస్తుండగా, సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.