కరీంనగర్, జనవరి 1 : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే తెరాస నేత గుండా నాగరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాలయం ఒక వేదిక కావాలని పిలుపునిచ్చారు. నిత్యం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం రూ.కోటి వ్యయంతో ఈ భవనాలను నిర్మిచిందని పేర్కొన్నారు. వీటితో పాటు ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల్లో అదనపు గదులను ప్రారంభించారు.