గచ్చిబౌలి, జూన్ 19 : పద్మజ అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి లోని సుదర్శన్ నగర్ లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ లో నివసిస్తున్న నరసింహకు, పద్మజకు గత సంవత్సరం ఏప్రిల్ లో వివాహం జరిగింది. పద్మజ మాదాపూర్ లోని బ్యాంకు అఫ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. నరసింహ టెక్ మహేంద్ర లో పని చేస్తున్నాడు. వివాహం అయిన కొన్ని నెలల నుంచి పద్మజకు, నరసింహ మధ్య మనస్పర్ధలు వచ్చి చాలా సార్లు గొడవలు కూడా జరిగాయి. కట్నం కోసం పద్మజను వేధించేవాడని . ఇలా ప్రతి సారి గొడవలు జరుతుండటం తో మనస్తాపానికి గురైన పద్మజ ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఎవరులేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడిందని బందువులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.