భద్రాది, డిసెంబర్ 30: ప్రేమించిన అమ్మాయి తన సొంతం కాకుండా వేరొకరితో పెళ్లి అయిపోతుందని తెలిసి ఆమెను చంపడానికే సిద్ధమయ్యాడు ఓ ప్రేమోన్మాది. ఆఖరికి ఆమె ప్రాణాలు తీసి తను చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం నెమలిపేటలో చోటు చేసుకుంది. పల్లవి అనే యువతి వెంట శ్రీనివాసరాజు అనే ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ నిత్యం వెంటపడుతుండేవాడు. పల్లవి స్థానిక స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఇటీవలే పల్లవికి వివాహం నిశ్చయమై౦ది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరాజు ఈ రోజు పాఠశాలకు వెళ్లి పల్లవి మెడ కోసి, కత్తితో పొడిచాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.