హైదరాబాద్, డిసెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం గత నెల హైటెక్స్లోని హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమన్ని అద్భుతంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ను అభినందిస్తూ భారత్ లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ.జస్టర్ రాసిన లేఖలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపట్టిన జీఈఎస్ సదస్సు ఆశించిన దానికన్నా అద్భుతంగా నిర్వహించి తనను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక చొరవ తీసుకుని సదస్సు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కేటీఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడి విధానాలు దేశానికే ఆదర్శమని కెన్నెత్ స్పష్టం చేశారు.