ఆరోగ్య బీమా తప్పనిసరి : రమణాచారి

SMTV Desk 2017-12-29 18:01:00  Telangana Brahmin welfare parishad chairman KV Ramanachari, Akshaya treasure

హైదరాబాద్, డిసెంబర్ 29 : బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం పేద బ్రాహ్మణుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌ కేవీ రమణాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేద బ్రాహ్మణుల్ని ఆదుకునేందుకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో నూతనంగా "అక్షయ నిధి"ని ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని, ఆర్థిక ఇబ్బందులు పడే బ్రాహ్మణులకు ఈ సహాయం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు పరిషత్‌ సభ్యుడు ఎమ్మెల్సీ సతీష్‌ తన వంతుగా రూ.1,01,116 చెక్కును కేవీ రమణాచారికి అందజేశారు. మరో సభ్యుడు చకిలం అనిల్‌ కుమార్‌ కూడా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఇవన్నీ, పేద బ్రాహ్మణుల ఆరోగ్య బీమా కింద ఖర్చు చేయాల్సిందిగా ఆయన వెల్లడించారు.