హైదరాబాద్, డిసెంబర్ 26 : మరో ఐదు రోజుల్లో నూతన ఏడాది వేడుక ప్రారంభం కానున్న సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఈ వేడుకలు జరుపుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ సూచించారు. ఈ వేడుకల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని, అలాగే మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడితే, వారిపై నగర వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి ఒకటో తేదీ 5 గంటల వరకు 100 బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడితే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.