సీసీఎల్ టీ-10 బ్లాస్ట్ విజేత తెలుగు వారియర్స్

SMTV Desk 2017-12-26 11:07:00  ccl-10, telugu warriors, won, kerala strikers,

హైదరాబాద్, డిసెంబర్ 26 : సినీ తారల క్రికెట్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు వరుసగా మూడో సారి విజేతగా నిలిచింది. సీసీఎల్ సరి కొత్తగా ప్రవేశ పెట్టిన 10 ఓవర్ల ఫార్మాట్ టీ-10 బ్లాస్ట్ సిరీస్ ఫైనల్లో కేరళ స్ట్రైకర్స్ జట్టు పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫిని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ స్ట్రైకర్స్ జట్టు నిర్ణిత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన తెలుగు వారియర్స్ జట్టు 7.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి విజయ భేరి మోగించింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ (46, 22 బంతుల్లో) తన మెరుపు బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ కధానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి మ్యాచ్ కు హాజరై ఆటగాళ్లను, ప్రేక్షకులను అలరించారు. జట్టు ఆటగాళ్లందరూ మెగా స్టార్ తో సెల్ఫీ తీసుకుని సందడి చేశారు.