హైదరాబాద్, డిసెంబర్ 25 : దేశవ్యాప్తంగా నేడు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. క్రిస్మస్ ను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని కేసీఆర్ తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హ్యాపి మేరీ క్రిస్మస్ అంటూ, యేసుక్రీస్తు నేర్పిన కరుణ, త్యాగం వంటి విలువలను ఎల్లప్పుడూ పాటిస్తామని వెల్లడించారు.