హైదరాబాద్, డిసెంబర్ 24 : తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం అంటూ లేకుండా విజయం అనే వెలుగులో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా రాణిస్తున్న నిర్మాత దిల్రాజు. ఈ ఏడాదిలో దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ఏకంగా ఆరు చిత్రాలు హిట్ అవ్వడం విశేషం. "శతమానం భవతి", "నేనులోకల్", "ఫిదా", "దువ్వాడ జగన్నాథమ్", "రాజా ది గ్రేట్", "ఎంసీఏ" ఈ ఆరు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొంది, బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన "శతమానం భవతి" ఉత్తమ చిత్రంగా అవార్డులు కూడా అందుకుంది. "దిల్" చిత్రం హిట్ తో దిల్ రాజుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సంస్థ వేడుకను నిర్వహిస్తోంది. డిసెంబరు 25న రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి పై ఆరు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, యూనిట్ సభ్యులు హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్వీట్ ద్వారా ప్రత్యేక పోస్టర్ను పంచుకుంటూ, ‘మా నిర్మాణ సంస్థకు 2017 చిరస్మరణీయమైన ఏడాదిగా నిలవడంతో, 2017 వేడుకను డిసెంబరు 25న నిర్వహిస్తున్నాం" అని ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం దిల్రాజు బ్యానర్లో "శ్రీనివాస కల్యాణం" అనే చిత్రం తెరకెక్కుతున్నట్లు ఈ బృందం తెలిపింది.