ఉస్మానియా శవాగారానికి రక్షణ కరువు...

SMTV Desk 2017-12-20 17:54:23  Smania hospital is the corpse, girl death, bandi koot

హైదరాబాద్, డిసెంబర్ 20 : హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి శవాగారంలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి శవాగారంలోనికి తీసుకొచ్చిన ఓ యువతి మృతదేహా అవయవాలను ఎలుకలు, పందికొక్కులు కొరికేశాయి. నగరంలోని హబీబ్‌నగర్‌కి చెందిన 21 ఏళ్ల యువతి, సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ నగరానికి చెందిన పోలీసులు మృతదేహాన్ని శవా పరీక్ష నిమిత్తం ఉస్మానియా శవాగారానికి తరలించారు. మంగళవారం ఆసుపత్రికి వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు శవాన్ని చూసి నిర్ఘాంతపోయారు. మృతురాలి ముక్కు, పెదవులు, చెవులు దారుణంగా కొరికేశాయి. దీంతో ఆమె బంధువులు ఆసుపత్రి అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టరుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ వెల్లడించారు.