నగరానికి చేరుకున్న రాష్ట్రపతి

SMTV Desk 2017-12-19 15:56:57  President, Ram Nath Kovind, telugu maha sabhalu, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 19 : హైదరాబాద్ లోని ఎల్బీ మైదానంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ప్రపంచ తెలుగు మహా సభల ముగింపు వేడుకల నిమిత్తం, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నగరానికి చేరుకున్నారు. ఒక ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ఉపన్యాస౦ ఇవ్వనున్నారు. తొలి రోజు ఈ మహా సభల ప్రారంభ వేడుకను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆరంభించిన విషయం తెలిసిందే. కాగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ మహా సభలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.