బిజెపిని ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకమవ్వాలి : అసదుద్దీన్ ఒవైసీ

SMTV Desk 2017-12-18 16:19:29  asasuddin owaisi, bjp, modi, rahul gandhi. #gujratelections2017

హైదరాబాద్, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బిజెపి విజయకేతనం ఎగురవేసే దిశగా పరుగులు పెడుతున్న వేళ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బిజెపిని ఓడించాలంటే అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి రావాలన్నారు. బిజెపిని గుజరాత్ లో కాంగ్రెస్ ఓడించే అవకాశం వచ్చినా... రాహుల్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ని మట్టుబెట్టాలంటే అఖిలేష్, అసదుద్దీన్, మమతా బెనర్జీ లాంటి వారు ఒంటరిగా పోటీచేస్తే ఇలాగే ఉంటుందని జ్యోష్యం చెప్పారు. వ్యాపారులు ఎక్కువగా ఉండే గుజరాత్ లోని సూరత్ లో సైతం బీజేపీ జెండా ఎగురవేసిందన్నారు. కాంగ్రెస్ గొంతు చించుకుని జీఎస్టీపై ప్రసంగాలు చేసినా ఫలితం మిగలలేదని హెద్దేవ చేసారు. ఎల్లకాలం బీజేపీ నే గెలుస్తూ.. ఉండదని రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు ఓటర్లు వ్యతిరేక ఫలితాలను రుచి చూపించిన విషయం మరిచిపోవద్దన్నారు.