హైదరాబాద్, డిసెంబర్ 18 : రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, ట్రాఫిక్ వంటి అంశాలను సమతుల్యం చేసుకుంటూ పక్కా ప్రణాళికలను రూపొందించాం. రహదారుల అభివృద్ధికి రూ.3 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా౦" అంటూ పేర్కొన్నారు.