టచ్‌ చేసి చూడులో రాశీ ఖన్నా

SMTV Desk 2017-12-18 12:24:44  Rashikanna, toch chesi chudu, movie

హైదరాబాద్, డిసెంబర్ 18 : ఊహాలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖన్నా తాజాగా ‘టచ్‌ చేసి చూడు’ లో మాస్ మహా రాజా రవితేజతో కలసి నటిస్తోంది. రవితేజతో బెంగాల్ టైగర్, రాజాదీ గ్రేట్ లో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ముచ్చటగా మూడోసారి కూడా ‘టచ్‌ చేసి చూడు’ అంటుంది. ఇటీవల తమిళంలోనూ అడుగుపెట్టిన రాశీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘సంగీతం, పుస్తకాలు మినహాయిస్తే నాకు మరో ప్రపంచం తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. సినిమాలు, స్నేహితులకు నా జీవితంలో కీలక స్థానం ఉంది. సినిమా సినిమాకీ స్నేహితులు పెరుగుతున్నారు. వాళ్లతో ప్రయాణం నాలో కొత్త మార్పుల్ని తీసుకోస్తుంది. చిత్రసీమలోకి అడుగుపెట్టిన తరువాత నా ప్రపంచం కొంచెం కొంచెం పెద్దది అవుతూ వస్తోంది. ఇప్పుడు మరింత విశాలమైంది’’ అంటూ చెప్పుకొంచ్చింది ఈ ముద్దు గుమ్మ.