సమన్వయంతో పని చేస్తే ఫలితాలు సాధ్యం : కడియం

SMTV Desk 2017-12-17 15:50:24  warangal, kadiyam sri hari, deputy minister, telangana

వరంగల్‌, డిసెంబర్ 17 : వరంగల్‌ జిల్లా హన్మకొండ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాలలో ఐక్య ఉపాధ్యాయ రాష్ట్ర సదస్సులో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించాలి. విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వం, ప్రజల సమన్వయంతోనే పని చేస్తే మంచి ఫలితాలు సాధించగలం. విద్యా వ్యవస్థలో సమస్యలుంటే ఎవరైనా ధైర్యంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు." అని వెల్లడించారు.